హైదరాబాద్, సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): స్టార్టప్ రంగంలో మహిళలు రాణించేందుకు అవసరమైన సహాయ, సహకారాలను అందించేందుకు ఫిక్కీ ఎఫ్ఎల్వో హైదరాబాద్ ఆధ్వర్యంలో సదస్సును సోమవారం నిర్వహిస్తున్నారు.
గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ, సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (సీఐఈ) ఆధ్వర్యంలో మహిళలు స్టార్టప్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందించేలా ఫిక్కీ ఎఫ్ఎల్వో ఈ స్టార్టప్ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎఫ్ఎల్వో హైదరాబాద్ చైర్పర్సన్ సీఏ శుభ్ర మహేశ్వరి, మేనేజ్మెంట్ నిపుణులు డాక్టర్ రితేష్ కుమార్ దూబేలు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు.