హైదరాబాద్, మే 25: స్విట్జర్లాండ్కు చెందిన ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్ తెలంగాణలో మరో యూనిట్ను నెలకొల్పబోతున్నది. రూ.500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న రెండో యూనిట్తో వేలాది మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
స్విట్జర్లాండ్కు చెందిన బయోఫార్మాస్యూటికల్స్ కంపెనీ ప్రస్తుతం మెటర్నల్, గ్యాస్ట్రో, యూరోలాజీ విభాగానికి చెందిన పలు ఔషధాలను విక్రయిస్తున్నది. సంస్థకు యూరప్తోపాటు దక్షిణ అమెరికా, చైనా, భారత్, అమెరికాల్లో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసింది. 1950లో ప్రారంభమైన ఈ సంస్థ అనతికాలంలో అంతర్జాతీయంగా తన వ్యాపారాన్ని విస్తరించింది. ప్రస్తుతం 110 దేశాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తున్నది.