చెన్నై, ఫిబ్రవరి 20:ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్.. దేశీయ మార్కెట్లోకి నయా స్కూటర్లను విడుదల చేసింది. 125 సీసీ విభాగంలో విడుదల చేసిన ఈ స్కూటర్లు మూడు రకాల్లో లభించనున్నది. వీటిలో రే జెడ్ఆర్ 125 ఎఫ్ హైబ్రిడ్ (డిస్క్) ధర రూ.89,530, ఫ్యాసినో ఎస్ 125 ఎఫ్ హైబ్రిడ్(డిస్క్) మాడల్ ధర రూ.91,030, రే జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ హైబ్రిడ్(డిస్క్) మాడల్ రూ.93,530గా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.