న్యూఢిల్లీ, జనవరి 1: ఆటోమొబైల్, ఆటో విడిభాగాలకు ఉద్దేశించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీము కాలపరిమితిని ఒక ఏడాది పొడిగిస్తున్నట్టు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సాధికారిక కార్యదర్శుల కమిటీ ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ స్కీము కాలపరిమితిని పాక్షిక సవరణలతో పొడిగిస్తున్నట్టు తెలిపింది. సవరించిన స్కీము ప్రకారం 2023-24 నుంచి వరుసగా ఐదు ఆర్థిక సంవత్సరాలు ఆటో రంగ సంస్థలకు ఉత్పత్తితో అనుసంధానించిన ప్రోత్సాహకం లభిస్తుంది. 2023-24లో పొందిన ప్రోత్సాహకం చెల్లింపు 2024-25లో జరుగుతుంది.