హైదరాబాద్, ఆగస్టు 12: దేశంలో అతిపెద్ద బీమా రంగ సంస్థల్లో ఒకటైన పీఎన్బీ మెట్లైఫ్..తెలంగాణ మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే హైదరాబాద్లో మూడు, వరంగల్, ఖమ్మంలలో ఐదు శాఖలను ఏర్పాటు చేసిన సంస్థ.. మిగతా జిల్లాకు కూడా తన వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు పీఎన్బీ మెట్లైఫ్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ సమీర్ బన్సల్ తెలిపారు.
కరోనా తర్వాత బీమా తీసుకునేవారి సంఖ్య గణనీయం గా పెరిగారని, అయినప్పటికీ దేశ జనాభాలో ఆరు శాతానికి మించలేదని వ్యా ఖ్యానించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 37 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న సంస్థ.. ఏపీలో 19 శాతం వృద్ధి నమోదైందన్నారు.