EXcise Duty on Petrol |
పెట్రోలియం ఉత్పత్తులపై 2020-21తో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఎక్సైజ్ డ్యూటీ వసూళ్లు 33 శాతం పెరిగాయి. ప్రీ-కోవిడ్ నాటి పరిస్థితులతో పోలిస్తే 79 శాతానికి పైగా వసూలయ్యాయి. 2020-21లో ఎక్సైజ్ డ్యూటీ వసూళ్లు రూ.1.28 లక్షల కోట్లయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రూ.1.71 లక్షల కోట్లకు పైగా ఖజానాకు చేరిందని ఆర్థికశాఖలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) పేర్కొంది.
పెట్రోల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ పెంచడం వల్ల 2019-20లో రూ.95,930 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ ఏడాది 79 శాతానికి పైగా పెరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ కలెక్షన్స్ రూ.3.89 లక్షల కోట్లు అయితే, 2019-20లో రూ.2.39 లక్షల కోట్లు.
దేశీయ పన్నుల వ్యవస్థలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమలులోకి తెచ్చాక పెట్రోల్, డీజిల్, ఎయిర్ టర్భైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్), సహజవాయువుపై మాత్రమే కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ విధిస్తోంది. మిగతా వస్తువులు, సేవలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. 2018-19లో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం వసూళ్లు రూ.2.3 లక్షల కోట్లు ఖజానాకు చేరాయి. 2017-18లో రూ.2.58 లక్షల కోట్లు వసూలు అయ్యాయి.