Urjit Patel | ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ (58) ఆసియా మౌలిక వసతుల పెట్టుబడి బ్యాంక్ (ఏఐఐబీ) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారని సమాచారం. ఏఐఐబీలోని ఐదుగురు ఉపాధ్యక్షుల్లో ఉర్జిత్ పటేల్ ఒకరు కానున్నారు. ఆయన మూడేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. వచ్చేనెలలో బాధ్యతలు స్వీకరిస్తారు. ఉర్జిత్ పటేల్..2016 సెప్టెంబర్ ఐదో తేదీన నాటి రఘురామ్ రాజన్ పదవీకాలం ముగియడంతో ఆర్బీఐ గవర్నర్గా వైదొలిగారు. మరునాడు ఆర్బీఐ 24వ గవర్నర్గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. కానీ 2018లో వ్యక్తిగత కారణాల రీత్యా వైదొలిగారు.
ఇంతకుముందు ఉపాధ్యక్షుడిగా పని చేసిన డీజే పాండ్యన్ స్థానంలో ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు. డీజే పాండ్యన్.. ఏఐఐబీఉపాధ్యక్షుడిగా.. దక్షిణాసియా, పసిఫిక్ ఐలాండ్స్, ఆగ్నేయాసియా ప్రాంత దేశాల్లో బ్యాంక్ సావరిన్, నాన్సావరిన్ లెండింగ్ వ్యవహరాల ఇన్చార్జిగా వ్యవహరించారు. ఇంతకుముందు పాండ్యన్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఈ నెలాఖరులో పాండ్యన్ తిరిగి భారత్కు వచ్చేస్తారని సమాచారం. భారత్ వ్యవస్థాపక సభ్య దేశం. చైనా తర్వాత అధిక ఓటింగ్ షేర్ కలిగి ఉన్న దేశం ఇండియా. బీజింగ్ నుంచి ఏఐఐబీ సేవలందిస్తున్నది. చైనా ఆర్థిక శాఖ ఉప మంత్రి జిన్ లికున్ దీనికి సారధ్యం వహిస్తారు.