హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): టీ హబ్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉజ్వల భవిష్యత్ ఉన్న ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలో వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన టెక్నాలజీ, తయారీ రంగానికి అవసరమైన ఉత్పత్తుల గురించి ఔత్సాహికులకు తెలియచేసేందుకుగాను టీ హబ్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నది. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు ఐదు రోజులపాటు ఈవీ బూట్ క్యాంప్ను నిర్వహిస్తున్నది. ఐఐఎం రాంచీతో కలి సి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఔ త్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు (https:// bit.ly/ 3N WsM3n)లో సంప్రదించాలన్నారు.