హైదరాబాద్, నవంబర్ 29: అంతర్జాతీయ వ్యాపార విస్తరణను మరింత వేగవంతం చేసింది హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫార్మా దిగ్గజం గ్లాండ్ ఫార్మా. యూరప్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అక్కడి సంస్థ సెనెక్సి గ్రూపును 120 మిలియన్ యూరోల(రూ.1,015 కోట్లు)కు కొనుగోలు చేసేయోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. 100 శాతం వాటా కొనుగోలుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి.