EPFO | ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది. 2023 డిసెంబర్ నెలలలో నికరంగా 15.62లక్షల మంది కొత్తగా సభ్యులుగా చేరారు. ఈ విషయం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పేరోల్ డేటా పేర్కొంది. డేటా మేరకు డిసెంబర్లో 15.62లక్షల మంది కొత్త సభ్యులు ఈపీఎఫ్వోలో పేర్లు నమోదు చేసుకోగా.. 2022 డిసెంబర్ మాసంతో పోలిస్తే 4.62శాతం పెరిగింది. అయితే, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రయోజనాలకు గురించి అవగాహన పెరడంతో ఈపీఎఫ్లో సభ్యులుగా చేరుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
డిసెంబర్ దాదాపు 8.41లక్షల మంది కొత్త సభ్యులు ఈపీఎఫ్వోలో పేర్లు నమోదు చేసుకున్నారు. నవంబర్ 2023తో పోలిస్తే 14.21శాతం ఎక్కువగా. కొత్తగా చేరిన సభ్యుల్లో 18-25 సంవత్సరాల మధ్య 57.18శాతం ఉన్నారు. దాదాపు 12.02లక్షల మంది ఈపీఎఫ్వో నుంచి నిష్క్రమించగా.. పేరోల్ డేటా పేర్కొంది. డేటా ప్రకారం జెండర్ డేటాను పరిశీలిస్తే 8.41లక్షల మంది కొత్త సభ్యుల్లో దాదాపు 2.09లక్షల మంది మహా సభ్యలు ఉన్నారు.
నవంబర్ 2023 కంటే 7.57శాతం ఎక్కువగా. డిసెంబర్లో నికర మహిళల సభ్యత్వం దాదాపు 2.90లక్షలకు చేరింది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల నుంచి కొత్త సభ్యుల సంఖ్య గరిష్ఠంగా పెరిగిందని ఈపీఎఫ్వో డేటా పేర్కొంది. డిసెంబర్ 2023లో ఈ రాష్ట్రాల నుంచే దాదాపు 9.11 లక్షల మంది సభ్యులు ఉద్యోగుల భవిష్య నిధిలో సభ్యులుగా చేరారు. మొత్తం సభ్యుల్లో 58 శాతం. మహారాష్ట్ర వాటా 21.63శాతం ఉన్నది. ఈపీఎఫ్వో ఏప్రిల్ 2018 నుంచి పేరోల్ డేటాను విడుదల విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.