హైదరాబాద్, నవంబర్ 30: ప్రోడక్ట్ ఇంజినీరింగ్, సెమికండక్టర్ డిజైన్ సేవల సంస్థ ఇన్ఫోచిప్స్.. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన డిజైనింగ్ సెంటర్ను మరింత విస్తరిస్తున్నది. వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా సెంటర్ను విస్తరిస్తున్నది. ఇందులో భాగంగానే వచ్చే రెండేండ్లలో మరో 250 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు తాజాగా ప్రకటించింది. వచ్చే ఆరు నెలల్లో 100 మందిని నియమించుకోనున్న సంస్థ.. మిగతా 150 మందిని ఆ తర్వాత రిక్రూట్ చేసుకోనున్నది. వీరందరిని హైదరాబాద్ డిజైన్ సెంటర్ కోసం మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నట్లు కంపెనీ సీవోవో సుమిత్ సేథి తెలిపారు. సిలికాన్ డిజైనింగ్, వెరిఫికేషన్, ఫిజికల్ డిజైనింగ్పై దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈ రిక్రూట్మెంట్కు మొగ్గుచూపినట్లు ఆయన చెప్పారు. ఆరౌ ఎలక్ట్రానిక్స్ సబ్సిడరీ సంస్థే ఇన్ఫోచిప్స్ అన్న విషయం తెలిసిందే.