Karvy Chairman in ED Custody | కార్వీ సంస్థ ఛైర్మన్ పార్థసారథిని ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇటీవలే ఆయనను బెంగళూరులో అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. గురువారం జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న అధికారులు వైద్య పరీక్షల తర్వాత ఈడీ కార్యాలయానికి తరలించారు. నాలుగు రోజులు పార్థసారథిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తారు. మనీలాండరింగ్తో పాటు సంస్థలో మదుపర్లషేర్లను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నట్లు పార్థసారథిపై పలు కేసులు నమోదయ్యాయి.
ఆ రుణాలను డొల్ల కంపెనీలకు మళ్లించి ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ముఖ్యంగా మనీ లాండరింగ్ అభియోగాలపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కార్వీ సంస్థ చైర్మన్ సీ పార్ధసారధితోపాటు సీఎఫ్వో జీ హరికృష్ణనూ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ.2000 కోట్ల సెక్యూరిటీ స్కామ్లో వీరిని ప్రశ్నించనున్నారు.