న్యూఢిల్లీ : పలు కేసుల్లో నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితురాలు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఈడీ షాక్ ఇచ్చింది. జాక్వెలిన్కు చెందిన రూ 7.27 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో ఆమె పేరుతో ఉన్న రూ 7.12 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ సహా పలు ఆస్తులున్నాయి.
మోసగించిన సొమ్ములో సుఖేష్ జాక్వెలిన్కు రూ 5.71 కోట్ల వరకూ బహుమతులుగా ఇచ్చాడని ఈడీ అంచనా వేసింది. సుఖేష్ బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్, నోరాకు ఖరీదైన బహుమతులు ఇచ్చి వారిని ఆకట్టుకున్నాడని ప్రచారం సాగింది. మరోవైపు జాక్వెలిన్ సన్నిహిత బంధువులకు 1.7 లక్షల యూఎస్ డాలర్లు, 27000 ఆస్ట్రేలియన్ డాలర్లు ఇచ్చాడని చెబుతున్నారు.
రాజకీయ నేత టీటీవీ దినకరన్ ప్రమేయంతో ఐదేండ్ల కిందటి చీటింగ్ కేసులోనూ సుఖేష్పై ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధించి సుఖేష్ను ఏప్రిల్ 4న ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ వ్యాపారి భార్య నుంచి రూ 215 కోట్లు అక్రమంగా తీసుకున్నందుకు సుఖేష్ను గత ఏడాది ఈడీ అరెస్ట్ చేసింది. సుఖేష్పై దర్యాప్తులో భాగంగా గత ఏడాది డిసెంబర్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈడీ ఎదుట హాజరవగా దర్యాప్తు ఏజెన్సీ ఆమెను ప్రశ్నించింది.