న్యూఢిల్లీ, మే 3: గత కొన్ని రోజులుగా స్థబ్దుగా ఉన్న బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా వీటి ధరలు అధికమవడంతో దేశీయంగా భారీగా పుంజుకున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.670 అధికమై రూ.60,750 పలికింది. రూ.1,150 పెరిగిన కిలో వెండి రూ.76,100 పలికింది.
ఇటు హైదరాబాద్లోనూ తులం బంగారం ధర మళ్లీ రూ.61 వేలు దాటింది. 24 క్యారెట్ల పదిగ్రాముల ధర రూ.880 అధికమై రూ.61,640కి చేరుకోగా, 22 క్యారెట్ల ధర రూ.800 పెరిగి రూ.56,500 పలికింది. కిలో వెండి కూడా రూ.1,300 అధికమై రూ.81,800కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,026 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా..వెండి 25.55 డాలర్ల వద్ద ఉన్నది. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ ధర 2 వేల డాలర్ల కంటే అధికంగానే నమోదవుతుండటంతో మదుపరులు అమెరికా ఫెడరల్ రిజర్వు తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.