న్యూఢిల్లీ, మార్చి 16: ఇటలీకి చెందిన సూపర్ బైకుల తయారీ సంస్థ డుకాటీ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త మోడల్ను పరిచయం చేసింది. ప్రత్యేక వార్షికోత్సవ ఎడిషన్గా ‘పానిగాలే వీ2’ మోటర్సైకిల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైకు ధర రూ.21.30 లక్షలుగా నిర్ణయించింది. దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టి 20 ఏండ్లు పూర్తైన సందర్భంగా లిమిటెడ్ ఎడిషన్గా ఈ బైకును ప్రవేశపెట్టింది. లిథియం-అయాన్ బ్యాటరీ, సింగిల్-సిట్ ఉండటంతో పాత మోడల్తో పోలిస్తే 3 కిలోలు తక్కువ బరువు కలిగివుండనున్నది. 955 సీసీ ట్విన్-సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ బైకు 155 హెచ్పీల శక్తినివ్వనున్నది.