న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశంలో డ్రైఫ్రూట్స్ ధరలు రెక్కలు తొడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో ఆదివారం నుంచి భారత్కు ఆ దేశానికి మధ్య ఎగుమతి-దిగుమతులు నిలిచిపోయాయి. అఫ్గానిస్తాన్ నుంచే భారత్కు ఎక్కువగా డ్రైఫ్రూట్స్ దిగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో డ్రైఫ్రూట్స్ ధరలు అమాంతం పెరిగిపోవచ్చన్న అంచనాలు మార్కెట్లో వినిపిస్తున్నాయి. అఫ్గాన్ నుంచి ఏటా దాదాపు 38వేల టన్నుల డ్రైఫ్రూట్స్ భారత్కు దిగుమతి అవుతున్నాయని డ్రైఫ్రూట్స్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ భుటా తెలిపారు. భారత్ నుంచి అఫ్గాన్కు చక్కెర, టీ, కాఫీ, దుస్తులు, ఔషధాలు, ట్రాన్స్మిషన్ పవర్స్, చెర్రీ, వాటర్మిలన్, మూలికలు ఎగుమతి అవుతున్నాయి. అఫ్గాన్ నుంచి భారత్కు డ్రైఫ్రూట్స్, ఉల్లిపాయలు, డ్రైడ్ రేసిన్, గమ్, జీరా వంటి సుగంధద్రవ్యాలు దిగుమతి అవుతున్నాయి.