హైదరాబాద్, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ బిజినెస్): రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా ఉత్పత్తుల సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరిస్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.1,112.80 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2021-22 ఏడాది ఇదే కాలానికి నమోదైన రూ.992 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది. సమీక్షకాలంలో కంపెనీ రూ.6,305.70 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది నమోదైన రూ.5,215.40 కోట్లతో పోలిస్తే తొమ్మిది శాతం అధికమని పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.11,521 కోట్ల ఆదాయంపై రూ.2,300 కోట్ల లాభాన్ని గడించింది.
‘ప్రస్తుత త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నది. అమెరికా మార్కెట్లోకి లెనాలిడోమిడ్ క్యాప్సల్ను విడుదల చేయడంతోపాటు మరిన్ని ఔషధాలు విడుదల చేయనుండటం ఇందుకు కారణం. పరిశోధన రంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొదిస్తున్నాం’
– జీవీ ప్రసాద్, రెడ్డీస్ కో-చైర్మన్, ఎండీ