హైదరాబాద్, సెప్టెంబర్ 5: దుబాయికి చెందిన మల్టీనేషనల్ లాజిస్టిక్ సేవల సంస్థ డీపీ వరల్డ్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. తెలంగాణలో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి రూ.215 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. 2005లో దుబాయి పోర్ట్స్ ఆథార్టీ, దుబాయి పోర్ట్స్ ఇంటర్నేషనల్, డీపీ వరల్డ్ విలీనమయ్యాయి.
అంతర్జాతీయ కంటైనర్ల ట్రాఫిక్లో 10 శాతం వాటా కలిగిన డీపీ వరల్డ్కు 82 సముద్ర, అంతర్గత కంటైనర్ డిపోలను 40 దేశాల్లో ఏర్పాటు చేసింది. కార్గో లాజిస్టిక్స్, పోర్ట్ టర్మినల్, సముద్ర రవాణా సేవలు అందిస్తున్నాయి.
డీపీ వరల్డ్ ఇండస్ట్రీ: లాజిస్టిక్స్ ప్రారంభం: 2005
ప్రధాన కార్యాలయం: దుబాయి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
కీలక వ్యక్తులు: సుల్తాన్ అహ్మద్ బిన్ సులాయెమ్
ఉత్పత్తులు: లాజిస్టిక్స్, రేవులు, సముద్ర రవాణా సేవలు
ఆదాయం: 10.7 బిలియన్ డాలర్లు(2021లో)
ఉద్యోగులు: 1,01,440
అనుబంధ సంస్థలు: దుబాయి వరల్డ్