ముంబై, డిసెంబర్ 9: దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్.. గోవా నుంచి వారానికి 42 విమాన సర్వీసులు నడుపబోతున్నట్టు ప్రకటించింది. ఉత్తర గోవాలోని మోపా విమానాశ్రయం నుంచి హైదరాబాద్తోపాటు ముంబై, బెంగళూరులకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను నడపనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ నూతన విమానాశ్రయాన్ని ఈ నెల 11న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
అలాగే గోవాలో ఉన్న పాత విమానశ్రయం నుంచి యథాతథంగా సర్వీసులు కొనసాగించనున్నట్టు పేర్కొంది. వాడియా గ్రూపునకు చెందిన గో ఫస్ట్ ప్రస్తుతం డబోలిం ఎయిర్పోర్ట్ నుంచి 65 నాన్-స్టాప్ ఫ్లైట్ సర్వీసులను నడుపుతున్నది. ఈ నూతన విమానాశ్రయాన్ని జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్కు చెందిన జీఎమ్మార్ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ నిర్మించింది. ఆదివారం ప్రధాని ప్రారంభించనున్నప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం జనవరి 5 నుంచి అందుబాటులోకి రానున్నది.