హైదరాబాద్, మే 25: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.538 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.321 కోట్ల లాభంతో పోలిస్తే 67 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 18 శాతం ఎగబాకి రూ.1,951 కోట్ల నుంచి రూ.2,303 కోట్లకు చేరుకున్నది. మరోవైపు, రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.30 లేదా 1,500 శాతం తుది డివిడెండ్ను ప్రతిపాదించింది. ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా శనివారం సమావేశమైన కంపెనీ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.7,845 కోట్ల ఆదాయంపై రూ.1,600 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.