న్యూయార్క్ : ఆర్ధిక మాంద్యం భయాలు, మందగమనంతో పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మాస్ లేఆఫ్స్ వణికిస్తుండగా తాజాగా డిస్నీ (Disney layoffs) తన నెక్ట్స్ జనరేషన్ స్టోరీ టెల్లింగ్ విభాగం, కన్జూమర్ ఎక్స్పీరియన్స్ విభాగాల్లోని సిబ్బందిపై వేటు వేసింది. డిస్నీ మెటావర్స్ వ్యూహాలను నెక్ట్స్ జనరేషన్ స్టోరీటెల్లింగ్ విభాగం పర్యవేక్షిస్తోంది.
స్టోరీటెల్లింగ్ టీంలోని 50 మంది ఉద్యోగులను డిస్నీ తొలగించిందని వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కొలువులు కోల్పోయిన వారిలో పలువురు మరో జాబ్ కోరుతూ లింక్డిన్ను ఆశ్రయించారు. ఇక డిస్నీ నెక్ట్స్ జనరేషన్ స్టోరీటెల్లింగ్, కన్జూమర్ ఎక్స్పీరియన్స్ యూనిట్ చీఫ్ మైక్ వైట్ను మాత్రం కంపెనీ కొనసాగిస్తోంది.
అయితే తదుపరి మైక్ కంపెనీలో ఏ బాధ్యతలు చేపడతారనేది వెల్లడికాలేదు. ఆర్ధిక అనిశ్చితి, మాంద్య భయాలు వెంటాడుతుండటంతో డిస్నీ ఇన్వెస్టర్ల ఒత్తిడితో పలు మార్పులు, వ్యయ నియంత్రణ చర్యలకు పాల్పడుతోంది. ఖర్చులు తగ్గించుకునే మార్గాలను అన్వేషించేందుకు గత ఏడాది డిస్నీ కన్సల్టింగ్ కంపెనీ మెకిన్సీ సేవలను సైతం ఉపయోగించుకుంది. మరోవైపు నెట్ఫ్లిక్స్, అమెజాన్ వంటి ప్రత్యర్ధుల నుంచి కూడా డిస్నీ దీటైన పోటీ ఎదుర్కొంటోంది.
Read More :
Layoffs | భారత్లో ఇంజనీరింగ్ టీంపై గిట్హబ్ వేటు
ChatGPT | చాట్జీపీటీతో ఊడనున్న కొలువు ఇదే..: ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ వెల్లడి