న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ప్రత్యక్ష పన్ను వసూళ్లు జోరందుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 13.70 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూళ్లయ్యాయని ఆదాయ పన్ను శాఖ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వసూలైన రూ.11,35,754 కోట్లతో పోలిస్తే 20.66 శాతం అధికం. ఈ నెల 17 నాటికి రూ.13,70,388 కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. వీటిలో కార్పొరేషన్ ట్యాక్స్ కింద రూ.6.95 లక్షల కోట్లు, సెక్యూరిటీ ట్రాన్జాక్షన్ ట్యాక్స్ కలుపుకొని వ్యక్తిగత ఆదాయ పన్ను రూ.6.73 లక్షల కోట్లుగా ఉన్నాయి.