Digital Payments |న్యూఢిల్లీ, మార్చి 4: ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం ఈ ఏడాదిలోనే ఇంటర్ఆపరబుల్ సిస్టమ్ను ప్రవేశపెడతామని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ వెల్లడించారు. సోమవారం ఒక సదస్సులో మాట్లాడుతూ ప్రస్తుతం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వ్యాపారులకు వినియోగదారులు జరిపే లావాదేవీలు పేమెంట్ అగ్రిగేటర్ల (పీఏ) ప్రాసెస్ అవుతున్నాయని, దీనికోసం బ్యాంక్ వివిధ ఆన్లైన్ మర్చెంట్స్ కోసం ప్రతీ పీఏతోనూ ఇంటిగ్రేట్ కావాల్సి వస్తున్నదని దాస్ తెలిపారు.
అంటే ఖాతాదారుకు చెందిన బ్యాంక్, ఆయా పీఏతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకోవడం అవసరమని, అది లేకపోతే చెల్లింపు వ్యాపారికి చేరదంటూ ప్రస్తుత సిస్టమ్లో ఉన్న కష్టనష్టాలను దాస్ వివరించారు. పలు పేమెంట్ అగ్రిగేటర్లతో ప్రతీ బ్యాంకూ ఇంటిగ్రేట్ కావడం కష్టమని, అందువల్ల వినియోగదారుల చెల్లింపులు వ్యాపారులకు అందడంలో జాప్యం జరుగుతుందని, సెటిల్మెంట్ రిస్క్లు ఏర్పడతాయన్నారు.