Phonepe | న్యూఢిల్లీ, మే 6: డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్పే.. అక్షయ తృతీయ దృష్ట్యా తమ యూజర్లకు స్పెషల్ క్యాష్బ్యాక్ ఆఫర్ను ప్రకటించింది. ఈ నెల 10న అక్షయ తృతీయ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 24 క్యారెట్ డిజిటల్ గోల్డ్ కొనుగోలుదారులకు రూ.2,000 వరకు తగ్గింపు ఆఫర్ను ఇచ్చింది.
అయితే కనీసం రూ. 1,000 విలువైన కొనుగోళ్లకే ఆఫర్లు వర్తిస్తాయి. యూపీఐ, యూపీఐ లైట్, క్రెడిట్, డెబిట్ కార్డులు, గిఫ్ట్ కార్డుల పద్ధతుల్లో కూడా కొనుగోళ్లు చేసుకోవచ్చు. క్యారెట్లేన్ స్టోర్లలోనూ రాయితీలను అందిస్తున్నది.