Budget 2023-24 | కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను బుధవారం లోక్సభకు సమర్పించారు. ప్రతి ఏటా కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రతిపాదించినప్పుడల్లా వేతన జీవులు తమకు ఇన్కం టాక్స్లో రాయితీలు ఇస్తారా? అన్న విషయాన్నే పరిశీలిస్తున్నారు. పాత ఇన్కం టాక్స్ పాలసీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కొన్ని సవరణలు చేసి, మధ్య తరగతి ప్రజలకు రిలీఫ్ కల్పించినట్లు చెప్పారు. రూ.7 లక్షల వరకు ఆదాయం గల వరకు నూతన పన్ను విధానంలో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఏడు శ్లాబ్ల ఆదాయం పన్ను విధానాన్ని ఐదు శ్లాబ్లకు కుదించారు. కానీ, కేంద్ర మంత్రి సవరించిన శ్లాబ్ల మాయాజాలంలో అసలు వాస్తవాలివి..
రూ. 3 లక్షల వరకు ఆదాయం పన్ను పూర్తిగా మాఫీ చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అంతకు మించి ఆదాయం ఉంటే శ్లాబ్ల వారీ ఆదాయం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీకు రూ.10 లక్షల ఆదాయం వస్తుందనుకుందాం.. అందులో రూ.3 లక్షల ఆదాయానికి పన్ను మినహాయిస్తే మిగతా రూ.7 లక్షలపై కొత్తగా ప్రతిపాదించిన పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.70 వేలు పన్ను చెల్లించాల్సిందే.
తాజాగా చేసిన సవరణ ప్రకారం పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.52,500లకు పెంపు.