Dhanteras 2022 | దంతేరాస్ అంటే ధన్ త్రయోదశి. వైద్య ధన్వంతరి జయంతి. ఈ రోజును పవిత్ర సమయంగా ప్రజలంతా పరిగణిస్తుంటారు. అందుకే దంతేరాస్ రోజు ప్రజలు.. బంగారం, వెండి, ఇతర ముఖ్యమైన వస్తువుల కొనుగోళ్లు చేస్తుంటారు. దీనివల్ల తమ జీవితాల్లోకి వెలుగులు విరజిమ్ముతాయని, శుభం జరుగుతుందని వారి నమ్మకం.
ప్రతియేటా కార్తీక మాస క్రుష్ణ పక్షంలో వచ్చే త్రయోదశిని ప్రజలు దంతేరాస్గా జరుపుకుంటారు. 2022లో దంతేరాస్ ఎప్పుడు వస్తుందన్న విషయమై కొంత కన్ఫ్యూజన్ ఉంది. త్రయోదశి తిథి ప్రారంభ, ముగింపు వేళలపై కాశీ జ్యోతిష్యుడు చక్రపాణి భట్ దీనిపై స్పష్టత ఇచ్చారు. ఈ నెల 22న త్రయోదశి ప్రారంభమై 23న ముగుస్తుందని పేర్కొన్నారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది కార్తిక మాస క్రుష్ణ పక్ష త్రయోదశి తిథి శనివారం 06:02 గంటలకు మొదలై ఆదివారం 06:03 గంటల వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దంతేరాస్ ఎప్పుడు జరుపుకోవాలనే కన్ఫ్యూజన్ ప్రజల్లో ప్రత్యేకించి వ్యాపారుల్లో ఉంటుంది.
దంతేరాస్ నాడు లక్ష్మీదేవికి వ్యాపారులు, సామాన్య ప్రజానీకం ప్రత్యేక పూజలు చేస్తారు. అందుకు ముహూర్తం టైం కూడా ఉంటుంది. త్రయోదశి ప్రదోష్ పీరియడ్లో పూజలు చేస్తారు. ఈ ఏడాది శనివారం ప్రదోష్ కాలంలో లక్ష్మీ పూజ పూర్తి చేయొచ్చు. కనుక ఈ ఏడాది ఈ నెల 22నే దంతేరాస్, ధన్వంతరి జయంతి జరుపుకోవచ్చు.
ధంతేరాస్ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడానికి ఈ నెల 22 (శనివారం) సాయంత్రం 07:01 గంటల నుంచి రాత్రి 08.17 గంటల వరకు పవిత్రమైన సమయం. దంతేరాస్ పూజ గంటన్నర చేపు చేయొచ్చు. లక్ష్మీదేవికి పవిత్రమైన సమయంలో పూజ చేయడం వల్ల కుటుంబం శ్రేయస్సు, సంపద పెరుగుతాయి.