ముంబై : ఈ ఏడాది చివరిలో డిజిటల్ కరెన్సీ మోడల్ను కేంద్ర బ్యాంక్ వెల్లడించవచ్చని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ. రవిశంకర్ పేర్కొన్నారు. ఈ మోడల్కు సంబంధించి టెక్నాలజీ, పంపిణీ సహా విధివిధానాలపై ఆర్బీఐ కసరత్తు సాగిస్తోందని అన్నారు. వర్చువల్ కరెన్సీలపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తున్నా డిజిటల్ కరెన్సీ ప్రవేశపెట్టే ప్రణాళికల గురించి ఆర్బీఐ గతంలో పలు సందర్భాల్లో ప్రస్తావించింది.
నగదుపై ఆధారపడటం తగ్గించడం, లావాదేవీల వ్యయం తగ్గింపు లక్ష్యంగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఉపకరిస్తుందని ఈ ఏడాది జులై 22న ఓ వెబినార్ కీలకోపన్యాసంలో రవిశంకర్ వ్యాఖ్యానించారు. బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల పట్ల ఆర్బీఐ విముఖత చూపుతున్నా డిజిటల్ కరెన్సీ ప్రవేశపెట్టేందుకు సానుకూలంగా ఉన్నట్టు పలు సందర్భాల్లో పేర్కొంది.