Supreme Court | అదానీ వ్యవహారంలో హిడెన్బర్గ్ రిపోర్ట్పై విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో నివేదికపై విచారణ జరిపించాలని, ఇందుకోసం కమిటీని వేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. న్యాయవాది విశాల్ తివారీ గురువారం పిటిషన్ను అత్యవసరంగా విచారణ కోసం సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు జాబితా చేయాలని చేయాలని కోరారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలా ఉన్నారు.
ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉన్నది. ఇంతకు ముందు అదానీ గ్రూప్ వ్యవహారంపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ఇంతకు ముందు న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టులో గతవారం పిటిషన్ దాఖలు చేశారు. అదానీ గ్రూప్ మోసపూరిత లావాదేవీలు జరుపుతుండడంతో పాటు షేర్ల ధరలను తారుమారు చేస్తున్నట్లుగా హిడెన్బర్గ్ తన నివేదికలో ఆరోపించింది. తర్వాత అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్ాయయి. అయితే, అదానీ గ్రూప్ అన్ని ఆరోపణలను ఖండించింది.