న్యూఢిల్లీ, ఆగస్టు 25: బీ2బీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా లాజిస్టిక్ సేవల సంస్థ డెలివరీ..బెంగళూరుకు చెందిన స్పాటాన్ లాజిస్టిక్ను కొనుగోలు చేసింది. ఆర్థిక వివరాలు మాత్రం సంస్థ వెల్లడించలేదు. గత పదేండ్లలో బీ2సీ లాజిస్టిక్ విభాగంలో సత్తా చాటిన సంస్థ..బీ2బీ లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో స్పాటాన్ను కొనుగోలు చేసినట్లు డెలివరీ సీఈవో సాహిల్ తెలిపారు. డెలివరీ మరో మైలురాయికి చేరుకోనున్నదని, స్పాటాన్కు చెందిన సిబ్బంది కూడా చేరనుండటంతో అటు విలువ, వృద్ధిలోనూ దూసుకుపోనున్నదన్నారు. మరోవైపు డెలివరీ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి త్వరలో స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకునే యోచనలో ఉన్నట్లు ఉన్నతాధికారి ఒకరు సంకేతాలిచ్చారు. ఈ ఐపీవో ద్వారా బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలనుకుంటున్నది.