న్యూఢిల్లీ, మే 27: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) లిస్టయిన తర్వాత మార్కెట్ విలువను గణనీయంగా నష్టపోయింది. ఇష్యూ ధరతో పోలిస్తే ఇప్పటివరకూ రూ. 80,000 కోట్ల మేర సంస్థ విలువ తగ్గింది. రూ.949 ధరతో ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్ జారీచేయగా, స్టాక్ ఎక్సేంజీల్లో తొలిరోజే రూ.872 వద్ద లిస్టయ్యి రూ.42,500 సంపదను నష్టపోగా, అప్పటి నుంచి మరో రూ. 38,000 కోట్ల కోట్ల విలువను కోల్పోయింది. శుక్రవారం ఎల్ఐసీ షేరు రూ. 821.55 వద్ద ముగిసింది. ఇష్యూ ధరతో పోలిస్తే ఇది 13.5 శాతం తక్కువ. రూ. 949 ధర వద్ద సంస్థ మార్కెట్ విలువ రూ. 6,00,242 కోట్లుకాగా, లిస్టింగ్నాటికి అది రూ.5,57,675 కోట్లకు తగ్గింది. ఇప్పుడది రూ.5,19,630 కోట్లకు పడిపోయింది. లిస్టయిన నాటి నుంచి ఎల్ఐసీ షేరు రూ. 920 గరిష్ఠస్థాయిని, రూ.801.55 కనిష్ఠస్థాయిని తాకింది. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల కారణంగా దేశీ ఈక్విటీలు భారీగా తగ్గిన ప్రభావం ఎల్ఐసీ షేరుపై కూడా పడిందని విశ్లేషకులు చెప్పారు.