Inflation | న్యూఢిల్లీ, ఆగస్టు 30: అస్థిర రుతుపవనాలు, అంతర్జాతీయ పరిమాణాల కారణంగా మరికొద్ది నెలలు ధరలు గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతాయని కేర్ రేటింగ్స్ హెచ్చరించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తగ్గుదల, అధిక ద్రవ్యోల్బణంతో డిమాండ్ పడిపోతుందన్నది. కొవిడ్ పాండమిక్లో ప్రవేశపెట్టిన సబ్సిడీల్లో కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో కోత విధించిన ప్రభావం గ్రామీణులపై గట్టిగా పడుతుందని తెలిపింది. వర్షాభావ పరిస్థితులు దేశీయంగా ఆహారోత్పత్తుల ధరలు మరింత పెరుగుతాయని, మరోవైపు అంతర్జాతీయ పరిణామాలు సైతం దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులకు మద్దతు ఇవ్వవని కేర్ రేటింగ్స్ వివరించింది. ఈ రేటింగ్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసిన నివేదిక వివరాలు..