హైదరాబాద్, ఏప్రిల్ 23: ప్రముఖ టెక్నాలజీ సంస్థ సైయెంట్ అనుబంధ సంస్థ సైయెంట్ డీఎల్ఎం ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.1,192 కోట్ల ఆదాయంపై రూ.61.2 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది వచ్చిన ఆదాయంతో పోలిస్తే 43.2 శాతం పెరగగా, నికర లాభంలో 92.9 శాతం వృద్ధి నమోదైంది.
ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ఆంథోనీ మోంటల్బానో మాట్లాడుతూ..ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలను మరింత బలోపేతం చేయడానికి పలు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ రెండు విభాగాల నుంచి భారీగా ఆర్డర్లు వస్తున్నాయని, వచ్చే రెండేండ్లలో మరింత పెరిగే అవకాశం ఉన్నదన్నారు.