RBI on Cryptos | క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ మరోమారు కీలక హెచ్చరికలు జారీ చేసింది. క్రిప్టోలతో దేశ ఆర్థిక సుస్థిరతకు ముప్పని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. సొంత రిస్క్పై క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెడుతున్న ఇన్వెస్టర్లను హెచ్చరించడం ఆర్బీఐ గవర్నర్గా తన విధి అని గురువారం మీడియాకు చెప్పారు. దేశీయ సూక్ష్మ, ఆర్థిక, ద్రవ్య సుస్థిరతకు ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలతో ముప్పని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. రెండు కోణాల్లో ఎదురయ్యేసవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలన్నారు. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టడం మీ ఆర్థికాభివృద్ధికి పూల బాట కాదన్నారు.
క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడుల లాభాలపై 30 శాతం పన్ను విధిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రిప్టోలతో దేశ సూక్ష్మ ఆర్థిక, ద్రవ్య సుస్థిరతకు ముప్పని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పునరుద్ఘాటించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. కనుక ఇన్వెస్టర్లు సొంత రిస్క్తో మాత్రమే క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు.