న్యూఢిల్లీ, జనవరి 10: గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృం దాలకు (ఎస్హెచ్జీలు) రుణ సదుపాయం కల్పించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసింది. స్వయం సహాయక బృందాల్లో మహిళా ఔత్సాహిక వాణిజ్యవేత్తల కోసం స్వయం సిద్ధ పేరుతో ఎస్బీఐ ఒక ప్రత్యేక స్కీమును ప్రవేశపెట్టింది. దీని కింద రూ. 5 లక్షల వరకూ రుణ సదుపాయం అందిస్తారు. బ్యాంక్ రుణ దరఖాస్తులతో ఎక్కువగా డాక్యుమెంట్లు సమర్పించడం, రుణ వితరణకు అధిక సమయం పట్టడం వంటి సవాళ్లను తొలగించేలా ఈ స్కీమ్ను డిజైన్ చేశామని ఎస్బీఐ సీజీ ఎం శాంతను పాండ్సే వివరించారు. స్థానిక ఎస్బీఐ శాఖల్లో కేవైసీ వివరాలతో రుణ దరఖాస్తును సమర్పించవచ్చని, ఇందుకోసం ప్రత్యేకించిన క్షేత్రస్థా యి సిబ్బంది ద్వారా రుణ చెల్లింపు ప్రక్రి య జరుగుతుందని వివరించింది.