హైదరాబాద్, ఆగస్టు 24: రాష్ర్టానికి చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ కంట్రోల్ఎస్..థాయ్లాండ్లో తన తొలి డాటా సెంటర్ను ప్రారంభించింది. నేషనల్ టెలికం పబ్లిక్ కంపెనీ(ఎన్టీ)తో కలిసి ఏర్పాటు చేసిన ఈ డాటా సెంటర్ 150 మెగావాట్ల కెపాసిటీ కలిగివున్నది. విదేశాల్లో సంస్థ ఏర్పాటు చేసిన తొలి సెంటర్ కూడా ఇదే కావడం విశేషం. థాయ్లాండ్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్గా మారుతున్న థాయ్లాండ్లో డాటా సెంటర్లకు డిమాండ్ ఉంటుందన్న అంచనాతో కంట్రోల్ఎస్ అక్కడి మార్కెట్లోకి అడుగుపెట్టింది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో సబ్మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయడానికి కంట్రోల్ఎస్ సిద్ధమవుతున్నది.