Credit Card Discounts | దేశీయ మార్కెట్లోకి కొత్తగా క్రెడిట్ కార్డులు వచ్చేశాయి. మరికొన్ని క్రెడిట్ కార్డుల రాబోతున్నాయి. వీటిని పేటీఎం.. మొబిక్విక్.. వంటి ఆన్లైన్ పేమెంట్స్ సంస్థలు… ప్రైవేట్ బ్యాంకుల పార్టనర్షిప్తో జారీ చేశాయి. గత రెండు నెలలుగా మూడు బ్యాంకులు.. ఆన్లైన్ పేమెంట్ సంస్థలు కలిసి ఏడు క్రెడిట్, పేమెంట్ కార్డులు జారీ చేశాయి. సాధారణంగా క్రెడిట్ కార్డులపై రివార్డు పాయింట్లు లభిస్తాయి. కానీ ఆన్లైన్ పేమెంట్ సంస్థలతో కలిసి బ్యాంకులు జారీ చేసే ఈ కార్డులతో చేసే పేమెంట్స్పై నేరుగా క్యాష్బ్యాక్ ఆఫర్లు పొందొచ్చు.
ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పేటీఎం కలిసి సంయుక్తంగా ఐదు డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేశాయి. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా సంప్రదాయ రివార్డు పాయింట్లు ఇవ్వడానికి బదులు క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తున్నాయి. ఈ కార్డులను ఉపయోగించి పేటీఎం మాల్ నుంచి షాపింగ్ చేస్తే మూడు నుంచి ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది.
ఈ రెండు సంస్థలకు చెందిన కొన్ని కార్డుల నుంచి బిల్లుల చెల్లింపులు జరిపితే మూడు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందొచ్చు. పేటీఎం-హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జారీ చేసిన క్రెడిట్ కార్డుల మెయింటెనెన్స్ చార్జీ నెలకు రూ.29 నుంచి వార్షికంగా రూ.1000గా ఖరారు చేశాయి. పెట్రోల్ తదితర ఫ్యూయల్ సర్చార్జి, ఎయిర్పోర్ట్ లాంజ్ సేవలు లభిస్తాయి.
ఇక మొబిక్విక్, యాక్సిస్ బ్యాంక్ మరో సంస్థతో కలిసి జారీ చేసిన ప్రీపెయిడ్ కార్డు ఫ్రీగానే పొందొచ్చు. హోం సెంటర్ కొనుగోళ్లపై 50 శాతం వరకు రాయితీ లభిస్తుంది. ఉబెర్ క్యాబ్ సేవలపై 30 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. మొబిక్విక్ వాలెట్, కార్డు బ్యాలెన్స్ ఇంటర్లింక్ చేస్తారు. ఈ కార్డు వినియోగదారుడు రూ.30 వేల వరకు బిల్లు చెల్లించి తర్వాత రుణం చెల్లించొచ్చు. క్రెడిట్ కార్డు మాదిరిగా రిటైల్ షాపింగ్, బిల్లు పేమెంట్స్పై రాయితీలు ఇస్తున్నాయి.
బ్యాంక్ బజార్ డాట్కామ్ కో ఫౌండర్ అదిల్శెట్టి గత నెలలో ప్రైవేట్ బ్యాంక్ యెస్ బ్యాంక్తో కలిసి క్రెడిట్ కార్డు విడుదల చేశారు. పది లక్షల మంది కస్టమర్లకు చేరువ కావాలన్న లక్ష్యంతో తాము ఈ క్రెడిట్ కార్డు జారీ చేశామని చెప్పారు. ఈ కార్డు సేవలను జీవిత కాలం ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. మెయింటెనెన్స్ ఫీజు చెల్లించనక్కర్లేదు. ఆన్లైన్ గ్రాసరీ షాపింగ్ చేస్తే ఐదు అదనపు రివార్డు పాయింట్లు లభిస్తాయి. అయితే, కస్టమర్లు తమ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండేలా చూసుకోవాలని ఆ సంస్థలు సూచిస్తున్నాయి. పెట్రోల్ సర్ చార్జీ మాఫీ, ప్రమాద బీమా కవరేజీ తదితర ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు లక్షల మంది నూతన ఖాతాదారులను నేరుగా పొందగలవు. కానీ బ్యాంకుల కంటే మెరుగ్గా ఫిన్టెక్ సంస్థలు అంటే ఆన్లైన్ ఫైనాన్సియల్ పేమెంట్స్ సంస్థలు తమ కస్టమర్లకు డిజిటల్ సేవలందిస్తున్నాయి. ఫిన్టెక్ సంస్థలకు కస్టమర్లు ఉన్నా, నష్టాల్లోనే మగ్గుతున్నాయి. పేటీఎం.. మొబిక్విక్ వంటి ఫిన్టెక్ సంస్థలు. బ్యాంకులతో అనుసంధానంతో ఎటువంటి లైసెన్స్ లేకుండానే బ్యాంకింగ్ సేవలందిస్తున్నాయి. ఇంతకుముందు పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్స్ ఫైనాన్సియల్ సర్వీసెస్ (ఫిన్టెక్) కంపెనీలు.. బ్యాంకులకు గట్టి పోటీదారులుగా నిలిచాయి. బ్యాంకులతో కలిసి పార్టనర్షిప్తో ఆదాయం పెంచుకునే రూట్ ఎంచుకున్నాయి.