Offers | కొత్త కార్లు కొనేవాళ్లకు గుడ్న్యూస్.. 2 లక్షల దాకా డిస్కౌంట్లు ప్రకటించిన కంపెనీలుఢిల్లీ, డిసెంబర్ 9: నూతన సంవత్సరంలో కార్ల కొనుగోలుదారులకు షాకిచ్చిన ఆటోమొబైల్ సంస్థలు..ఈ నెలలో మాత్రం భారీగా రాయితీలు ప్రకటించాయి. ఏడాది చివర్లో విక్రయాలు అంతం త మాత్రంగానే ఉంటాయన్న అంచనాతో ఆటోమొబైల్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి డిస్కౌంట్లను తెరపైకి తీసుకొచ్చాయి. ఈ ఏడాది కూడా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, ఫోక్స్వ్యాగన్తోపాటు ఇతర సంస్థలు భారీగా రాయితీలు ప్రకటించాయి.
పాత స్టాక్ను వదిలించుకోవడానికే..
ఆటోమొబైల్ సంస్థలు తమ వద్ద ఉన్న పాత స్టాక్స్ను వదిలించుకోవాలనే ఉద్దేశంతో పలు మాడళ్లను తక్కువ ధరకే విక్రయిస్తున్నాయి. దీంట్లో భాగంగా సంస్థలు రూ.2 లక్షల వరకు తక్కువ ధరకే ఆయా మాడళ్లను అమ్ముతున్నాయి. ఈ రాయితీలు ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయని కంపెనీలు పేర్కొంటున్నాయి.
జనవరిలో వాత తప్పదు..
డిసెంబర్లో తక్కువ ధరకే వాహనాలను విక్రయిస్తున్న సంస్థలు..ఆ మరుసటి నెల కొత్త సంవత్సరం తొలి నెల జనవరిలోనే వాహన ధరలను పెంచుతున్నట్టు ఇదివరకే ప్రకటించాయి. దీంతో కొనుగోలుదారులు ఈ నెలలోనే తమకు నచ్చిన వాహనాన్ని తక్కువ ధరకే దక్కించుకోవచ్చును. ఇంచుమించు అన్ని సంస్థలు తమ మాడళ్ల ధరలను పెంచుతున్నట్టు ఇదివరకే ప్రకటించాయి కూడా.
మారుతి సుజకీ రాయితీ ఇస్తున్న మాడళ్లు ఇవే..
హ్యుందాయ్..
మహీంద్రా..
ఫోక్స్వ్యాగన్..
హోండా కూడా..
మరో కార్ల సంస్థ హోండా కూడా పలు మాడళ్లపై రాయితీని ప్రకటించింది. అమేజ్పై రూ.77 వేల రాయితీని ప్రకటించిన సంస్థ..సిటీపై లక్ష రూపాయల వరకు ప్రత్యేక రాయితీని ఇస్తున్నది.
ఎంజీ మోటర్