న్యూఢిల్లీ, మే 11: కొలియర్స్ ఇండియా.. ఈ ఏడాది కొత్తగా 400 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్టు ప్రకటించింది. ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంతోపాటు నూతన సేవలను అందించడానికి అవసరమైన సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు తెలిపింది.
ప్రస్తుతం సంస్థలో 3 వేల మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఏడాది 350-400 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు కొలియర్స్ సీఎండీ ప్రసాద్ తెలిపారు.