తెలంగాణసహా ఆయా రాష్ర్టాలకు త్వరలో 5వేల నెబ్యులైజర్ల పంపిణీ
న్యూఢిల్లీ: సిప్లా.. తెలంగాణసహా దేశంలోని ఆయా రాష్ర్టాల్లోగల ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల (పీహెచ్సీ)కు 5వేల నెబ్యులైజర్లను విరాళంగా ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు నెబ్యులైజేషన్ థెరపీని మెరుగుపర్చ డం, అవగాహనను పెంచడంలో భాగంగానే ఈ నిర్ణ యం తీసుకున్నట్లు వివరించింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల (సీహెచ్సీ)కూ వీటిని పంపిణీ చేస్తామన్నది. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో ఈ నెబ్యులైజర్ల వితరణ జరగనున్నది. పీహెచ్సీ, సీహెచ్సీల్లోని పారామెడికల్ సిబ్బందికీ సురక్షిత నెబ్యులైజేషన్ థెరపీపై శిక్షణ ఇస్తామని స్పష్టం చేసింది.