హైదరాబాద్, అక్టోబర్ 9: ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ)..జీఎస్టీపై సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించబోతున్నది. ఈ నెల 12 నుంచి నాలుగు వారాలపాటు ప్రతి గురు, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. నవంబర్ 2న ఈ కోర్సు ముగియనున్నదని పేర్కొంది. ఈ కోర్సుకు సంబంధించి తరగతులు మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని వెల్లడించింది.