హైదరాబాద్, డిసెంబర్ 23: ఆంధ్రప్రదేశ్లో వెయ్యి కోట్ల రూపాయలతో వుడ్ ప్యానెల్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్టు సెంచూరీ ప్లేబోర్డ్స్ ప్రకటించింది. బద్వేల్ వద్ద ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్ను ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సెంచూరీ ప్లే చైర్మన్ సజ్జన్ భజన్కా మాట్లాడుతూ..100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ కోసం రెండు దశల్లో రూ.1,000 కోట్ల మేర పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పారు. దీంతో వచ్చే ఐదేండ్లకాలంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తొలి దశలో ఎండీఎఫ్ ప్లాంట్ కోసం రూ.700 కోట్లు, పీవీసీ-లామినేట్స్ కోసం మరో రూ.250 కోట్ల నిధులు వెచ్చించినట్టు తెలిపారు.