LIC Interim Chairman | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తాత్కాలిక చైర్మన్గా సిద్ధార్థ మహంతిని కేంద్రం నియమించింది. ఈనెల 14 నుంచి మూడు నెలల పాటు ఎల్ఐసీ చైర్మన్గా సిద్ధార్థ మహంతి బాధ్యతలు నిర్వర్తిస్తారని సమాచారం. ప్రస్తుతం ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్గా సిద్ధార్థ మహంతి పని చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్ఐసీ చైర్మన్గా ఉన్న ఎంఆర్ కుమార్ పదవీ కాలం ఈ నెల 13తో ముగియనున్నది. ఆయనకు పొడిగింపు ఇవ్వకపోవడంతో సిద్ధార్థ మహంతిని తాత్కాలిక చైర్మన్గా కేంద్రం నియమించడం గమనార్హం.
2021 జనవరి 31న ఎల్ఐసీ ఎండీగా రిటైర్ అయిన టీసీ సుశీల్ కుమార్ స్థానే సిద్ధాంత మహంతిని ఎల్ఐసీ ఎండీగా కేంద్రం నియమించింది. అంతకుముందు సిద్ధార్థ మహంతి.. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) కం మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా పని చేస్తున్నారు. ఈ పదవిలో సిద్ధార్థ మహంతి 2023 జూన్ నెలాఖరు వరకు కొనసాగుతారు.
ఇప్పటి వరకు ఎల్ఐసీలో పని చేసిన వారిలో ఒకరు సంస్థ చైర్మన్గా, నలుగురు ఎండీలుగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం బిష్ణు చరణ్ పట్నాయక్, ఐపీ మినీ, సిద్ధార్థ మహంతి, రాజ్ కుమార్లు ఎండీలుగా పని చేశారు. మంగళం రామసుబ్రమణ్యం కుమార్ కంపెనీ చైర్మన్గా ఉన్నారు.
ఆస్తుల ప్రకారం ప్రపంచంలోనే ఐదో బీమా సంస్థగా ఎల్ఐసీ నిలిచింది. మార్కెట్లో ఏడో స్థానంలో కొనసాగుతున్నది. భారత దేశంలోని బీమా మార్కెట్లో అత్యధిక వాటా సొంతం చేసుకున్నది. 13.35 లక్షల మంది ఏజంట్లు పని చేస్తున్నారు. రూ.27.80 కోట్ల విలువైన బీమా పాలసీలు అందుబాటులోకి వచ్చాయి.