న్యూఢిల్లీ, ఆగస్టు 9: నేపాల్, భూటాన్ తదితర పొరుగు దేశాలతో భారతీయ కరెన్సీ రూపాయల్లో వాణిజ్యాన్ని ప్రారంభించినట్టు బుధవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. ఈ మేరకు లోక్సభలో వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మ్రంతి అనుప్రియ పటేల్ ఓ ప్రశ్నకుగాను లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రూపాయల్లో అంతర్జాతీయ వాణిజ్యాన్ని రష్యాతోనూ ఆరంభించినట్టు మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. రుపీతో అంతర్జాతీయ లావాదేవీలు చేస్తున్న దేశాల జాబితాలో ఇరాన్, శ్రీలంక కూడా ఉన్నాయన్నారు. అలాగే జూలై 11న బంగ్లాదేశ్తోనూ మొదలైందని వెల్లడించారు. ఈ లావాదేవీలు భారత్కు కలిసివస్తాయని చెప్పారు.