న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్పై సీబీఐ చార్జ్షీట్ను దాఖలు చేసింది. వీడియోకాన్ గ్రూపు ఫౌండర్ వేణుగోపాల్ ధూత్కు ఇచ్చిన రూ.3,250 కోట్ల రుణాల మోసం కేసులో ఈ చార్జ్షీట్ దాఖలు చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
ఐపీసీ సెక్షన్ 120-బీ(నేరపూరిత కుట్ర), 409(నేర ఉల్లంఘన), అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఈ చార్జ్షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు.