Byjus | ఒకప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్టెక్ కంపెనీగా ఉన్న బైజూస్ (Byjus) ఇప్పుడు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తీవ్ర ద్రవ్య కొరతను ఎదుర్కొంటోంది. సంస్థలోని ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి. అయితే, ఇప్పుడు సంస్థకు మరో కొత్త కష్టం వచ్చి పడింది. అంతర్గతంగా పరిస్థితులు దిగజారడంతో ఉన్నత స్థాయి నాయకత్వం కంపెనీని వీడుతోంది.
గతేడాది బైజూ ఇండియా సీఈవో మృణాల్ మోహిత్ సంస్థను వీడిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో అర్జున్ మోహన్ (Arjun Mohan) బైజూస్ ఇండియా సీఈవోగా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే, ఇప్పుడు ఆయన కూడా తన పదవికి రాజీనామా చేసేశారు (CEO Quits). సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలలకే సంస్థను వీడాడు. సోమవారం ఆయన తన పదవికి రాజీనామా చేసేశారు. దీంతో స్టార్టప్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ (Byju Raveendran) సంస్థ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నట్లు కంపెనీ సోమవారం వెల్లడించింది.
ఇక రవీంద్రన్కు అత్యంత నమ్మకస్తుడిగా అర్జున్ మోహన్కు పేరుంది. ఈయన సుమారు 11 ఏళ్ల పాటు బైజూలో పనిచేశారు. గతంలో కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా పనిచేశారు. ఆ తర్వాత రెండేళ్లపాటు అప్గ్రాడ్ ఇండియా సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో అనుబంధ సంస్థ ఆకాశ్ కార్యకలాపాలను కూడా ఆయనే పర్యవేక్షించారు. గతేడాది సెప్టెంబర్లో మృణాల్ మోహిత్ స్థానంలో ఇండియా సీఈవోగా మోహన్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. కొందరిని ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీసులన్నింటినీ కూడా మూసివేశారు.
Also Read..
Producer | చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. ఇంట్లో శవమై కనిపించిన ప్రముఖ నిర్మాత
Salman Khan | సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే..!
Ram Navami | రామనవమికి ముస్తాబవుతున్న అయోధ్యానగరి.. వేడుకలకు 40 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం