BSNL Offer | పండుగల సీజన్ సందర్భంగా ప్రైవేటు టెలికం సంస్థలు సబ్ స్క్రైబర్స్కి దీపావళి సందర్భంగా ఆఫర్స్ని ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ టెలికం రంగ సంస్థ భారతీయ సంచారం నిగమ్ లిమిటెడ్ (BSNL) దీపావళి సందర్భంగా యూజర్లకు సరికొత్త ఆఫర్ని తీసుకువచ్చింది. ఈ ఆఫర్ పండుగ తర్వాత కూడా చెల్లుబాటు కానున్నది. జియో దీపావళి ఆఫర్తో పోలిస్తే మెరుగైన ప్రయోజనాలను అందిస్తున్నది. బీఎస్ఎన్ఎల్ దివాళీ ఆఫర్ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 7 వరకు చెల్లుబాటు అవుతుంది. యూజర్లు రూ.1,9000 రీచార్జ్ ప్లాన్పై రూ.100 డిస్కౌంట్ని ప్రకటించింది. అంటే ప్లాన్ రూ.1,899 మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్తో పాటు 600 జీబీ డేటాను పొందుతారు. 365 రోజుల పాటు రోజుకు వంద ఉచిత ఎస్ఎంఎస్ సైతం పొందుతున్నారు. ఈ ఆఫర్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీపావళి స్పెషల్ ఆఫర్లో రూ.1,999 రీచార్జ్ వోచర్పై రూ.100 తగ్గింపు ఇస్తున్నట్లు పేర్కొంది ఏడాది పాటు 600 జీబీ డేటా, అపరిమిత కాల్స్, గేమ్స్, మ్యూజిక్ సైతం ఆస్వాదించొచ్చని పేర్కొంది. ఈ ఆఫర్ నవంబర్ 7 వరకు చెల్లుబాటవుతుందని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. వైశాట్ సహకారంతో బీఎస్ఎన్ఎల్ తొలిసారిగా డైరెక్ట్ టూ డైరెక్ట్ సర్వీస్ని విజయవంతంగా ట్రయల్ నిర్వహించింది. త్వరలో వినియోగదారులకు సిమ్కార్డ్ అవసరం లేకుండా నేరుగా డివైజ్ టూ డివైజ్ మధ్య ఆడియ, వీడియో కాల్స్ చేసుకునేందుకు వీలు కల్పించబోతున్నది. ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ట్రయల్స్ సమయంలో బీఎస్ఎన్ఎల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ని ఉపయోగించి 36వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపగ్రహ నెట్వర్క్ ద్వారా విజయవంతంగా ఫోన్ కాల్ చేసింది. అత్యవసర సేవలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఈ సర్వీసులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని.. చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.