BSNL | హైదరాబాద్, మార్చి 2: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తెలంగాణ టెలికం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా నిర్మల్ పీజీ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారమే ఆయన ఈ కొత్త హోదాలోకి వచ్చినట్టు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో బీఎస్ఎన్ఎల్ తెలియజేసింది.
కాగా, నిర్మల్.. 1991 బ్యాచ్కు చెందిన ఇండియన్ టెలికం సర్వీస్ (ఐటీఎస్) అధికారి. టెలీకమ్యూనికేషన్స్ రంగంలో వివిధ హోదాల్లో దేశవ్యాప్తంగా 29 ఏండ్లకుపైగా పనిచేసిన అనుభవం ఈయనకు ఉన్నది. ఇంతకుముందు బీఎస్ఎన్ఎల్ కేరళ టెలికం సర్కిల్లో నిర్మల్ పనిచేశారు.