దేశంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్.. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) చైర్మన్గా ఎస్ఎస్ ముంద్రా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం జరిగిన బీఎస్ఈ డైరెక్టర్ల బోర్డు.. ఎస్ఎస్ ముంద్రాను పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్గా, చైర్మన్గా నియమిస్తూ తీర్మానం చేసింది. జస్టిస్ విక్రమ్జిత్ సేన్ స్థానంలో ఎస్ఎస్ ముంద్రా నియమితులయ్యారు. బీఎస్ఈ డైరెక్టర్ల బోర్డు ఎస్ఎస్ ముంద్రాను సంస్థ పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్గా, చైర్మన్గా నియమించామని, సెబీ ఆమోదంతో అమల్లోకి వస్తుందని ఎన్ఎస్ఈ ఫైలింగ్లో తెలిపింది.
ఎస్ఎస్ ముంద్రా మూడేండ్ల పాటు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్గా పని చేసి 2017 జూలైలో రిటైర్ అయ్యారు. అంతకుముందు బ్యాంక్ ఆఫ్ బరోడా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా 2014 జూలై నుంచి పని చేశారు.
నాలుగు దశాబ్దాలకు పైగా బ్యాంకింగ్ రంగంలో ఎస్ఎస్ ముంద్రా సేవలు అందించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, బ్యాంక్ ఆఫ్ బరోడా యూరోపియన్ ఆపరేషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తదితర బాధ్యతలు నిర్వహించారు. వివిధ కమిటీల్లో, ఆర్థిక సుస్థిరత బోర్డు (జీ-20 ఫోరం)లో ఆర్బీఐ నామినీగా పని చేశారు. ఓఈసీడీ ఫైనాన్సియల్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉపాధ్యక్షుడిగా పని చేశారు.