హైదరాబాద్, అక్టోబర్ 17: బెంగళూరుకు చెందిన రియల్టీ సంస్థ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్.. హైదరాబాద్లో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తున్నది.
ఈ క్రమంలోనే రూ.660 కోట్లతో 9.71 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. కోకాపేట్ నియోపోలిస్లో ఈ భూమిని సొంతం చేసుకున్నది. అయితే ఈ స్థలంలో ఏ ప్రాజెక్టును తీసుకురాబోతున్నారో ఆ వివరాలేవీ సంస్థ తెలియపర్చలేదు.