హైదరాబాద్, మార్చి 20: దేశంలో అతిపెద్ద కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండైన సామ్సంగ్.. గెలాక్సీ సిరీస్లో భాగంగా మరికొన్ని స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మధ్య-ప్రీమియం స్థాయి సెగ్మెంట్ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో గెలాక్సీ ఏ55 5జీ, గెలాక్సీ ఏ35 మాడళ్లను ప్రవేశపెట్టింది.
గోరిల్లా గ్లాస్ విక్టస్+ప్రొటెక్షన్, ఏఐతో పనిచేసే విధంగా కెమెరా ఫీచర్, ట్యాంపర్-రెసిస్టెంట్ సెక్యూరిటీ సొల్యుషన్ ఫీచర్ కలిగిన ఈ ఫోన్లు నాలుగు రకాల్లో లభించనున్నాయి. గెలాక్సీ ఏ55 5జీ మొబైల్ రూ.36,999 నుంచి రూ.42,999 లోపు, గెలాక్సీ ఏ35 5జీ మొబైల్ రూ.27,999 నుంచి రూ.30,999 లోపు లభించనున్నాయి. అలాగే హెచ్డీఎఫ్సీ, వన్కార్డ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేసిన వారికి రూ.3 వేల వరకు క్యాష్బ్యాక్, ఆరు నెలలపాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ సదుపాయాన్ని కూడా కల్పించింది.